BPHL: IDOC కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం జనగణనపై అధికారులతో శిక్షణ కార్యక్రమం, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 2027లో జరగనున్న జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో హౌసింగ్ వివరాలు సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.