SRD: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు దాతల సహకారం అవసరమని ప్రముఖ న్యాయవాది విశ్వనాథ స్వామి అన్నారు. ఇవాళ ఖేడ్ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న 169 మంది విద్యార్థులకు రూ. 20 విలువ గల పరీక్షా సామాగ్రిని ఆయన అందజేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం నిరంతరం బాగా చదివి అభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మన్మధ కిషోర ఉన్నారు.