JN: మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించే ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా జనగామలో వనిత టీ స్టాళ్ల తొలగింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధిత మహిళలు, సీపీఎం నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా కేటాయించిన కంటైనర్ టీ స్టాళ్లను అధికారులు తొలగించడం తగదని, వెంటనే నిలిపివేయాలని 3వ వార్డు కౌన్సిలర్ జ్యోతి డిమాండ్ చేశారు.