PLD: నకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో సోమవారం గుర్తు తెలియని దుండగులు వినాయక స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దుండగులు విగ్రహాన్ని పెకలించి, గుడి సమీపంలో పారవేసినట్లు స్థానికులు తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే స్వామివారి విగ్రహాన్ని ఇలా అవమానించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.