భద్రాద్రి: చర్ల మండలంలోని కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ హారిక తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ ఆప్తాల్మాలజిస్ట్ ఆర్థోపెడిక్, డెంటల్ స్పెషలిస్టులు అందుబాటులో ఉండి రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.