SRPT: అనంతగిరి నుంచి చనుపల్లి వరకు రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి మూడు నెలలకే అధ్వానంగా మారింది. పాలారం తండా శివారులో రోడ్డు అంచులు ధ్వంసం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని పనుల వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.