VKB: ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూములు సేకరిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని పరిగి మండలం రాపోల్, కాళాపూర్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు భూములను పరిశ్రమల పేరిట తీసుకోవడం వల్ల జీవనాధారం కోల్పోతామని వారు వాపోయారు. ఎన్నికల వేళ హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతుల భూములను లాక్కుని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.