KNR: రాష్ట్రంలో ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఖేల్ మహోత్సవంలో మాట్లాడుతూ.. అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిదర్శనమన్నారు. హెచ్ సీఏలో సెలెక్ట్ కావాలంటే పైరవీలు, డబ్బులు తీసుకుని సెలెక్ట్ చేసే సంస్కృతిని కొందరు తీసుకొచ్చారన్నారు.