JGL: ఈనెల 14 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షల కోసం కథలాపూర్ మండలంలో 4 పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు ఎంఈవో శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండలంలోని 13 పాఠశాలల్లో 511 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. కథలాపూర్ మోడల్ స్కూల్, జడ్పీ హైస్కూల్, గంభీర్పూర్ జడ్పీ హైస్కూల్, అంబర్పేట జడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.