MBNR: గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పద్మావతి కాలనీలోని అయ్యప్పకొండపై నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలలో మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సమాజంలో నైతికవిలువలు, సేవాభావం, ఐక్యత, సామరస్యం, సద్గుణాలను సేవాలాల్ పెంపొందించారని కొనియాడారు.