KMM: రఘునాథపాలెం మండలం కొలనుకుంటలో పేకాట ఆడుతున్న స్థావరంపై శనివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.