NZB: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి అన్నారు. శనివారం సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బాసర విజ్ఞాన విహార యాత్రను ఇవాళ ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీ నాయకులు ఉమ్మాజి నరేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.