కోనసీమ: అంబాజీపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కురసా ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఈ మేరకు పుల్లేటికుర్రు గ్రామంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ పాల్గొని అతనిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఆంజనేయులను పలువు నాయకులు ఘనంగా సత్కరించారు.