TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో రాబోయే మూడు రోజులు మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.