PPM: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల భద్రత, అగ్నిమాపక, విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH) పరిధిలో ఉన్న ఏడు ఆసుపత్రులలో తక్షణమే సమగ్ర సేఫ్టీ ఆడిట్( భద్రత తనిఖీలు) నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.