NZB: KMR నుంచి NZB వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు మొరాయించింది. శుక్రవారం డిచ్పల్లి వద్ద అర్ధాంతరంగా నిలిచిపోయిందని ప్రయాణికులు తెలిపారు. ఎండవేడి తాళలేక మొరాయించి నిలిచిపోయినట్లు RTC సిబ్బంది తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఇతర బస్సులను నిలిపి ప్రయాణికులను పంపడానికి కండక్టర్, డ్రైవర్ ప్రయత్నిస్తే బస్సులు ఆపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.