VZM: చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా విశాఖ జిల్లా వైసీపీ మహిళ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తనకు పరిశీలకులుగా నియమించిన జగన్ మోహన్ రెడ్డికి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.