CTR: పెద్దపంజాణి మండలంలోని బొమ్మరాజు పల్లెలో వైసీపీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ మాట్లాడుతూ.. మార్చి 8 లోపు వైసీపీ గ్రామ కమిటీల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీ యూనిట్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కమిటీలలోని సభ్యులకు పార్టీ అధిక ప్రాధాన్యమిస్తుందని వెల్లడించారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు.