NZB: కమ్మర్పల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంత ఇల్లు లభించినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.