BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ 14వ వార్డులో బత్తుల ప్రశాంతి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పావని మాట్లాడుతూ.. ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.