నెల్లూరు రూరల్ ములుమూడి గ్రామంలో అమ్మవారి ఆలయంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అమ్మవారి రెండు మంగళసూత్రాలు, ఆరు కాసులు, వెండి కిరీటం, వెండి శఠ గోపం చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ పూజారి రవితేజ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.