ATP: సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు గురువారం కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను నేరుగా CM దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.