మహబూబ్ నగర్ జిల్లాలో గత 5 రోజులుగా.. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్నచింతకుంట 38.3, భూత్పూర్ 38.2, కోయిలకొండ మండలం పారుపల్లి 38.1, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 37.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.