NLG: చిట్యాల మండలం ఏపూరులో బెల్ట్ షాపులను శాశ్వతంగా ఎత్తివేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం మహమ్మారి వల్ల యువత పెడదోవ పడుతుండటం, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంతో సర్పంచ్ పాలెం మహేష్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, వారు కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేసేందుకు అంగీకరించారు.