WGL: ఖానాపురం మండలం అశోక్ నగర్ సైనిక్ స్కూల్ను ఎంపీడీవో వనపర్తి అద్వైత బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఉపాధ్యాయుల హాజరు, బోధన తీరును పరిశీలించారు. ఆర్మీ ఇన్స్ట్రక్టర్, కెమిస్ట్రీ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.