TPT: శ్రీసిటీలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలు బుధవారం నిర్వహించారు. పరిశ్రమల సిబ్బంది, ఉద్యోగులు, సమీప పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ సతీష్ కామత్ భద్రతా జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేయించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి భద్రతా ప్రమాణాల పాటింపు అత్యవసరమని పేర్కొన్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.