SRCL: తంగళ్ళ పల్లి మండలం నేరెళ్ల బాధితుల వద్దకు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నేరెళ్లలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన కూడా నేరెళ్ల బాధితులకు న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.