AP: శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభలో వైసీపీ సభ్యుల నిరసనలు, ఆందోళనల మధ్య మండలి ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.