సత్యసాయి: బుక్కపట్నం మండలం పాముదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఖిద్మత్-ఎ-ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు షామీర్ ఆధ్వర్యంలో 60 మందికి రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకట లక్ష్మమ్మ చేతుల మీదుగా ఈ సామాగ్రిని విద్యార్థులకు అందించారు.