NLG: దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో MGNREGS నిధుల నుంచి మైనంపల్లి గ్రామానికి రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను మంజూరయ్యాయి. ఈ సందర్భంగా బీచ్యతాండలో మైనంపల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ గురువారం అధికారులు, సభ్యులతో కలిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలునాయక్, పంచాయతీ రాజ్ డీఈ లింగారెడ్డి, ఏఈ శంకర్ పాల్గొన్నారు.