AKP: నాతవరం మండలం చమ్మచింత సబ్ సెంటర్లో బుధవారం చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం జీ.కుమారి, అంగన్వాడీ, ఆశా కార్యకర్తల పర్యవేక్షణలో 0-5 ఏళ్ల చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, టీకాలు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారు వివరించారు.