AP: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై ప్రభుత్వం ప్రదర్శించిన తీరు అత్యంత హేయమని అన్నారు. అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా, అక్రమంగా అరెస్టులు చేశారని దుయ్యబట్టారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేసి, అత్యంత అమానవీయంగా వ్యవహరించారని మండిపడ్డారు.