MLG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామపంచాయతీ పరిధిలోని (పప్కాపూర్) కొమరం బీమ్ నగర్ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ పోరిక సరిత బుధవారం సందర్శించారు. పాఠశాల పనులు నిలిచిపోయిన విషయాన్ని జిల్లా కలెక్టర్, డీఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానన్నారు.