BDK: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా 25 కలశాలతో అభిషేకాలను నిర్వహించారు. పవిత్రమైన గోదావరి నది నుంచి జలాలను తీసుకుని మేళ తాళాలతో అభిషేకం చేశారు. ఆలయ ఈవో దామోదర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.