WGL: చంద్రగ్రహణం అనంతరం ఓరుగల్లు అధిదేవత భద్రకాళి అమ్మవారి దర్శనాలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు.. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు జరిపారు. గ్రహణం వీడటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.