NLG: చిట్యాల మండలంలో వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణ త్రాగునీరు పారిశుద్ధ్య విభాగం ఏఈ సతీష్ తెలిపారు. 18 పంచాయతీల పరిధిలోని 27 ఆవాసాలకు 508 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా 11,444 కుటుంబాలకు నీరు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పైప్లైన్ లీకేజీలను అరికట్టామని తెలిపారు.