కృష్ణా: పెనమలూరు పోలీసులు కానూరులో మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఆటోనగర్లో కొందరు కోతముక్కలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీ చేసి, 9 మంది జూదం ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,10,690ల నగదు, పేకముక్కలు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.