సత్యసాయి: పెనుకొండలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ను మంత్రి సవిత ఏర్పాటు చేయించారు. పట్టణంలో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు ఎండల నుంచి రక్షణ పొందేందుకు ఈ బస్సు షెల్టర్ ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని కల్పించినందుకు మంత్రి సవితకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.