BDK: కాలేశ్వరం నీళ్లు మున్నేరు శాఖలకు విడుదల చేసి ఎండి పోతున్న పంటలను కాపాడాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఇవాళ ఆ ప్రాంత పంట పొలాలను పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అనంతరం వ్యవసాయానికి కాలేశ్వరం నీళ్లు ఇల్లందు బయ్యారం, గార్ల, కురవి, డోర్నకల్ మండలాలకు అందించాలని డిమాండ్ చేశారు.