PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో గురువారం నిర్వహించనున్న శివపార్వతుల కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజేశం యాదవ్ తెలిపారు. చలువ పందిళ్లు, ఆలయం అలంకరణ చేయడం జరిగిందన్నారు. రేపు ఉదయం ఉత్సవానికి సంబంధించి పాలపొరక తేవడం, గురువారం స్వామి వారి కళ్యాణం ఉంటుందని పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.