GNTR: పొన్నూరు నియోజకవర్గంలోని మూడు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ. 8.20 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా చింతలపూడి రోడ్డుకు రూ. 4.20 కోట్లు, గోవాడ రోడ్డుకు రూ. 3.50 కోట్లు, పాండ్రపాడు రోడ్డుకు రూ. 50 లక్షలు కేటాయించామని పేర్కొన్నారు. ఈ రహదారుల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.