AP: అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప.గో.జిల్లా పాలకొల్లు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. రూ.5.80 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. అంగన్వాడీల 9 డిమాండ్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చిందన్నారు. అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘటన చంద్రబాబుదని కొనియాడారు.