ATP: పామిడిలోని బీకే కళ్యాణ మండపంలో ఈ నెల 8న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ తిరుపతి నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.