TPT: ఇవాళ చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. భక్తులతో నిరంతరం సందడిగా ఉండే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం ఇవాళ ఖాళీగా కనిపిస్తోంది. ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రాత్రి 8:30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.