AP: హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అంటే ప్రజల్లో సోదరభావం, సద్భావనను బలోపేతం చేస్తుందని అన్నారు. సమాజంలో శాంతి, శ్రేయస్సును పెంపొందించే ఉత్సాహభరితమైన పండగ అని పేర్కొన్నారు. ఈ పండగరోజు రంగులు చల్లుకోవటం ద్వారా జాతీయ సమైక్యతపై మన నమ్మకం, విశ్వాసం బలోపేతం అవుతుందని చెప్పారు.