PLD: నకరికల్లులో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గాజులగడ్డ, యాసం బజారు, ఎన్టీఆర్ బొమ్మ, జీడీసీసీ బ్యాంకు, గాంధీ బొమ్మ పరిసర ప్రాంతాల్లో కరెంటు ఉండదు. ఈ ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.