ADB: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హెల్త్ మిషన్-100 ను ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో హెల్త్ మిషన్-100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.