VKB: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి స్వర్గీయ డి.శ్రీపాదరావు సేవలు మరువలేనివని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో శ్రీపాదరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పీకర్ మాట్లాడుతూ.. శ్రీపాదరావు అందించిన ఉన్నతమైన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.