ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్లో హనుమంతునిపాడు మండలం టీడీపీ పార్టీ నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు, మండల స్థాయి సమస్యల పరిష్కారంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.