NLG: నకిరేకల్ మండలం మంగళపల్లిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం బచ్చుపల్లి గంగాధర్ రావు, సర్పంచు గాదరి జయమ్మ తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.35 లక్షలతో సంఘబంధం భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. మార్కెట్ డైరెక్టర్ బొల్లెద్దు లక్ష్మయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ బుజంగరావు, ఉపసర్పంచ్ రామాలింగారావు పాల్గొన్నారు.